Friday, May 2, 2025
spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

సింధు నదిలో మా నీళ్లైనా పారాలి.. భారతీయుల రక్తమైనా పారాలి..: ఇండియాకు బిలావల్ భుట్టో వార్నింగ్

కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్‌కు సంబంధం ఉన్న విషయం గురించి అందరికీ తెలిసిందే. నేరుగా ఆ దేశమే దీన్ని ఇప్పటికే ఒప్పుకోగా.. భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే తాజాగా దీనిపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి స్పందించారు. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇండియాకు గట్టి బదులిస్తామంటూ హెచ్చరించారు. ..: ఇండియాకు బిలావల్ భుట్టో వార్నింగ్

శ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే కాగా.. ఆ దేశం కూడా దీన్ని అంగీకరించింది. ఈక్రమంలోనే భారత్ ఆ దేశంపై పగ తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే తాజాగా దీనిపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావర్ భుట్లో జర్దారి స్పందించారు. భారత్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

సింధు నదిపై కొత్తగా కెనాల్స్ నిర్మించే అంశం గురించి ఇటీవలే పాకిస్థాన్ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగానే ఆ దేశంలోని రాష్ట్రాలన్నింటి మధ్య పరస్పర అంగీకారం లేకుండా కెనాల్స్ నిర్మించరాదన్న అభిప్రాయాన్ని అక్కడి స్థానిక ప్రభుత్వాలు తెలిపాయి. ఈక్రమంలోనే సుకుర్‌లో జరిగిన బహిరంగ సభలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ప్రసంగించారు. ఈ అంశంపై పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మధ్య ఒప్పందాలు కూడా కుదిరినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల ఆమోదం లేకుండా సింధు నదిపై కొత్తగా కాలువలు నిర్మించరాదని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము గట్టిగా బదులు ఇస్తామని వెల్లడించారు. ఇండియా తన నిర్ణయాన్ని ఏక పక్షంగా తీసుకున్నట్లు బిలావల్ చెప్పుకొచ్చారు. సింధు జలాలు మావే అంటూనే.. అవెప్పటికీ మావే అంటూ పునరుద్ఘాంటించారు. అంతేకాకుండా సింధు నదిలో తమ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ బిలావర్ వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో నదిని రక్షించుకునేందుకు ఇండియాపై పోరాటం కొనసాగిస్తామన్నారు. భారత్ తమ ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటన్ని ఆపమని వివవరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles