టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొరడా ఝుళిపించారు. సమన్లు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్లో నటించడం ఆయనకు చిక్కులను తెచ్చిపెట్టింది.