హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు.
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు.
బాలయ్య నటుడిగా యాభై ఏళ్ళ వేడుకను గత ఏడాది ఆగస్టు 30తో పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్..చిత్రాలు చేసారు . రాజకీయ రంగంలో సైతం మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.